Stolen In Bihar : బీహార్లోని రోహతాస్ జిల్లాలో 60 అడుగుల పాడుబడిన వంతెనను పట్టపగలు దొంగలు నిలువుదోపిడీ చేశారు. ఓ దొంగల ముఠా ఏకంగా ఇనుప వంతెనను దొంగిలించి అసాధారణ దోపిడీకి పాల్పడింది.. రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులుగా నటిస్తూ బ్రిడ్జిని కూల్చివేసేందుకు గ్యాస్ కట్టర్లు, ఎర్త్మూవర్ మిషన్లను ఉపయోగించి దొంగలు ఇనుప స్క్రాప్ మెటల్తో పరారయ్యారు.

నీటిపారుదల శాఖ అధికారులుగా నటిస్తూ కొందరు జేసీబీ, గ్యాస్ కట్టర్ వంటి యంత్రాలతో వంతెనను కూల్చివేశారని గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ జూనియర్ ఇంజనీర్ అర్షద్ కమల్ షంషీ సమాచారం అందించారు. ఆయన వచ్చి చూసేసరికి ఇనుప వంతెన మాయమైంది. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎఫ్ఐఆర్ దాఖలు అయ్యింది.
నీటిపారుదల శాఖ అధికారులుగా నటిస్తూ కొందరు వ్యక్తులు శిథిలావస్థలో ఉన్న పాడుబడిన ఇనుప వంతెన వద్దకు వచ్చి జేసీబీ యంత్రాలు, గ్యాస్ కట్టర్ల సహాయంతో పూర్తిగా కూల్చివేశారని గ్రామస్థులు తెలిపారు.
60 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తున్న వంతెన ఒక్కసారిగా మాయమైపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఆ శాఖ అధికారులు నస్రీగంజ్ పోలీస్ స్టేషన్లో దొంగలపై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.
“ఇటువంటి నిర్మాణం.. మరమ్మతు పనులు నెమ్మదిగా జరుగుతున్నందున గ్రామస్థులు ఇది నిజమేనని అనుకున్నారు. ఇది దొంగల పని అని అనుమానించలేదు. అదే దొంగలకు వరమైందని అధికారులు తెలిపారు.
Bihar |60-feet long-abandoned steel bridge stolen by thieves in Rohtas district
Villagers informed some people pretending as mechanical dept officials uprooted bridge using machines like JCB & gas-cutters. We've filed the FIR:Arshad Kamal Shamshi, Junior Engineer,Irrigation dept pic.twitter.com/o4ZWVDkWie
— ANI (@ANI) April 9, 2022