spot_img
Homeజాతీయంమారిటోరియం వినియోగించుకోనివారికి కేంద్రం గుడ్‌న్యూస్‌..

మారిటోరియం వినియోగించుకోనివారికి కేంద్రం గుడ్‌న్యూస్‌..

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో దాదాపు అన్ని వర్గాల ప్రజలు ఉపాధిని, ఆదాయాన్ని కోల్పోయారు. దీంతో లోన్లు తీసుకున్న వినియోగదారులు ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడ్డారు. వీరి ఇబ్బందులను గమనించిన కేంద్ర ప్రభుత్వం ముందుగా మూడు నెలలు మారిటోరియం ప్రకటించింది. మూడు నెలల వరకు ఈఎంఐలు కట్టకున్నా బ్యాంకులు ఒత్తిడి చేయవద్దని తెలిపింది. అయితే ఆ తరువాత వాయిదాల పద్దతిలో చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించింది. మార్చి 1 నుంచి మే వరకు గడువు ప్రకటించి ఆ తరువాత మరో మూడు నెలలు ఆగస్టు 31 వరకు పెంచింది.

Also Read: గూగుల్‌ పే యూజర్స్‌.. బీ అలర్ట్‌

మారిటోరియంను వినియోగించుకున్న వినియోగదారులపై బ్యాంకులు మాత్రం వడ్డీలు, చక్రవడ్డీలు విధించాయి. దీంతో వినియోగదారులు వడ్డీ మాఫీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయగా ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. మారిటోరియం వినియోగించుకున్న వారికి వడ్డీ చెల్లించేందుకు కేంద్రప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందుకోసం రూ.5000 నుంచి రూ.7000 కోట్లు భరించేందుకు సిద్ధమైంది. కేసు వినియోగదారులకు అనుకూలంగా వస్తే ఎవరెవరు ఎన్ని నెలలు మారిటోరియం వినియోగించుకున్నారో వారికి లబ్ధి చేకూరనుంది.

తాజాగా మారిటోరియం వినియోగించుకున్న వారికి ప్రభుత్వం వడ్డీ చెల్లించడంతో నెలనెలా సక్రమంగా ఈఎంఐలు చెల్లించినవారు మాకేమీ లేదా అన్నట్లు నిట్టూర్చారు.. అయితే మారిటోరియం వినియోగించుకోకుండా సక్రమంగా ఈఎంఐలు చెల్లించిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం రివార్డు ప్రకటించే అవకాశం ఉంది. మారిటోరియం వినియోగించుకున్నవారికి వడ్డీ చెల్లించనుండగా ఈఎంఐలు చెల్లించిన వారికి ప్రత్యేకంగా బహుమతులు ఇవ్వాలని సన్నాహాలు చేస్తోంది. ఈ విషయంపై ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ కథనం ప్రచురించింది.

Also Read: లాయర్లను బెదిరిస్తారా? ఏపీ పోలీసులపై హైకోర్టు ఫైర్‌‌

రూ. 2 కోట్ల లోపు రుణం తీసుకున్న వ్యక్తులు, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలకు క్యాష్‌బ్యాక్‌ ఇచ్చే యోచనలో ఉందట. కరోనా కష్ట సమయంలో లోన్‌ చెల్లించినవారికి ఈమాత్రం రివార్డు ప్రకటించకపోతే ఎలా..? అందుకనే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఆర్థిక శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి అన్నట్లు ఆ కథనంలో పేర్కొంది. మారిటోరియంపై వడ్డీ మాఫీ చేసే విషయం సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. ఇది పూర్తయిన తరువాత ఈఎంఐలు చెల్లించిన వారికి రివార్డులు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో వారిలో కొంత ఉత్సాహం నెలకొన్నట్లయింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper