Homeఅత్యంత ప్రజాదరణసింగర్ మంగ్లీ ఇలా మారిపోయిందేంటి?

సింగర్ మంగ్లీ ఇలా మారిపోయిందేంటి?

Singer Mangli

తెలుగు నాట తన గొంతుతో మంగ్లీ వేలాది మంది అభిమానులను సంపాదించుకుంది. గాయని, నటి, వ్యాఖ్యాతగా తనదైన శైలిలో దూసుకుపోతున్న మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్. మొదట తీన్మార్ వేదికగా ప్రాచుర్యం పొందిన మంగ్లీ తరువాత కాలంలో ఆమె గొంతు సరిచేసుకుని పసందైన పాటలు పాడుతున్నారు. మంగ్లీ నటన గురించి అందరికి తెలిసిందే. గతంలో కూడా కొన్ని చిత్రాల్లో నటించి తన నటనా కౌశలాన్ని ప్రదర్శించుకున్నారు. దీంతో ఆమె స్థాయిని పెంచుకుని తన నటనను ఇంకా పెంచుకుంటూ ముందుకు పోతున్నారు.

గత చిత్రాల్లో మంచి పాత్రలు పోషించిన ఆమెకు ఏకంగా నెగెటివ్ నేపథ్యం ఉన్న పాత్ర దొరికింది. నిన్నటి వరకు ప్లే బ్యాక్ సింగర్ గా కొనసాగుతున్న ఆమెను నెగెటివ్ షేడ్లు ఉన్న పాత్రకు ఎంపిక చేయడం వెనుక బలమైన కారణం ఉందని తెలుస్తోంది ఆ పాత్రకు ఆమె అయితేనే సరైన న్యాయం జరుగుతుందని భావించి నిర్మాత ఆమె ఎంపికకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని చానళ్లలో ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాల్లో నటిగా తన ప్రతిభను చాటుకుంటోంది.

మంగ్లీ 2017 నుంచి తీన్మార్ వార్తలతో తన టాలెంట్ నిరూపించుకుంటూ వస్తోంది. శైలజారెడ్డి అల్లుడు సినిమాలో టైటిల్ సాంగ్ పాడి క్రేజ్ సంపాదించుకున్నారు. అల వైకుంఠపురంలో కుర్రకారును ఉర్రూతలూగించిన రాములో రాములా పాట పాడి తనప్రత్యేకతను చాటుకుంది. దీంతో ఆమెకు వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. దీంతో సింగర్ గా పాపులర్ అయింది. తన గొంతుతో ప్రాచుర్యం పొందింది.

నితిన్ హీరోగా నటిస్తున్న అందారున్ రీమేక్ లో మంగ్లీ నెగెటివ్ పాత్రకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాలో నితిన్ కళ్లు లేని వాడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. నాబా నటేష్ మెయిన్ పాత్రలో నటిస్తుండగా తమన్నా విలన్ పాత్రలో కనిపించబోతోంది. కథను మలుపు తిప్పే పాత్రలో మంగ్లీ నటిస్తున్నట్లు సమాచారం. సింగర్ గా గుర్తింపు పొందిన మంగ్లీ భవిష్యత్తులో నటిగా కూడా తన టాలెంట్ నిరూపించుకోన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను విడుదల చేసినట్లు తెలిసింది.

నితిన్ ను కిడ్నాప్ చేసే లేడీ పాత్రలో మంగ్లీ నటించనుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా వంటి సినిమాలతో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. చివరగా ఆయన ఆధ్వర్యంలో వచ్చిన కృష్ణార్జున యుద్ధం బాక్సాఫీసు వద్ద బోల్తాపడిన విషయం తెలిసిందే. ఈ సినిమాను అందరు తిరస్కరించినా నితిన్ మాత్రం తీసేందుకు ముందుకు రావడంతో సినిమా పట్టాలెక్కినట్లు సమాచారం.

కథలో విభిన్నమైన మలుపులు ఉంటాయని చెబుతున్నారు. ట్విస్ట్ లతో కూడుకున్న సన్నివేశాలుండడంతోనే సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చెక్, రంగ్ దే సినిమాల అపజయంతో నితిన్ ఎలాగైనా విజయం సాధించాలనే కసితో ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. నితిన్ తరువాత సినిమా వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయడానికి ఒప్పుకున్నారు. కిక్, రేసుగుర్రం, టెంపర్ వంటి కథలు అందించిన వంశీపై నమ్మకంతోనే ఆయన దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించినట్లు సమాచారం.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular