స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయంలో ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ ను లక్ష్యంగా చేసుకొని, కులం పేరుతో నిందిస్తూ దేశంలో మరెక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరుగుబాటు ధోరణి ఆవలంభించడంతో పాలనాయంత్రాంగంలో అధికారులు నలిగి పోతున్నారు.
మరో మూడు, నాలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ కారణంగా అన్ని పక్షాలు కలిసి ఎన్నికలను వాయిదా వేసుకోగా ఇక్కడ దానిని రాజకీయ వివాదంగా మార్చి, కరోనా నివారణ చర్యల పట్ల ఉదాసీనత ప్రదర్శించడం అధికారులకు మింగుడు పడటం లేదు.
కరవమంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోపం అన్న చందంగా తమ పరిస్థితి ఉందని వాపోతున్నారు. స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాల్సిన అవసరం ఉండగా ప్రభుత్వమే ధిక్కార ధోరణి ప్రదర్శించడం ఎటు దారితీస్తుందో అనే భయం వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇద్దరు ఎస్పీలపై ఎన్నికల సంఘం వేటు వేసిన విషయాన్ని వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిరచినప్పటికీ చివరకు అమలు చేయకతప్పలేదని వారు గుర్తు చేస్తున్నారు.
ఇప్పుడు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాలను జగన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నప్పటికీ అమలు చేయకతప్పదన్న భావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం ఆదేశాలే అధికారుల్లో గుబులుకు కారణమవుతున్నాయి. నిష్పాక్షికంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి కోపం, లేదంటే ఎన్నికల కమిషన్ చర్యలు… ఇలా మధ్యలో తాము ఇరుక్కుపోవాల్సి వస్తోరదన్న ఆందోళన వారిలో కనిపిస్తోరది.గతంలో కూడా ఎన్నికల వేళ అధికారులు ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు.
ప్రతి ఎన్నికల్లో ఎంతో కొంతమందిపై వేటు పడడం కనిపిస్తూనే ఉన్నదని, బాగా పనిచేసినా, చేయకపోయినా తమపై ఫిర్యాదులు రావడం ఆనవాయితీగా మారిపోయిందని, తాజా ఎన్నికల్లో ఈ పరిస్థితి మరిరత జఠిలంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు కలెక్టర్లను బదిలీ చేయాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇప్పటివరకు అమలులోకి రాలేదు.
అమలు చేయాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా నిర్ణయాన్ని పునస్సమీక్షించు కోవాలంటూ ఎన్నికల కమిషన్కు లేఖరాయడం చూస్తే బదిలీలకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్న భావన వ్యక్తమవుతోరది. ఇలా ప్రభుత్వం మొండికేస్తే ఎస్ఇసి, ప్రభుత్వం మధ్య వివాదం మరింతగా పెరుగుతుందని, ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే ప్రమాదం కూడా ఉంటుందని సీనియర్ అధికారులు హెచ్చరిస్తున్నారు.