Journalists
సమాజంలో నాలుగో స్తంభం జర్నలిజం. ప్రజాస్వామ్యం, చట్టం, పోలీసు వ్యవస్థల తర్వాత మీడియాకు దేశంలో అంతటి ప్రాముఖ్యత ఉంది. మీడియా ఉంటే అందరినీ ఉచ్చపోయించవచ్చు అని అందరూ భావిస్తారు. బయట ఉన్న వారికి మీడియా వాళ్ల గురించి అలాంటి ఫీలింగే ఉంటుంది. పోలీసులు భయపడుతారు. మీడియా వాళ్లతో ఎందుకు గొడవ అనుకుంటారు. కానీ మీడియాలో ఉండే వారికే ఆ కష్టాలు తెలుసు. మీడియా మిత్రులందరూ చెప్పేది ఒకటే.. ఇప్పుడున్న మీడియాలోకి ఎవరూ రావద్దని.. కరోనా కాటుతో అన్నింటికంటే తీవ్రంగా దెబ్బతింది మీడియానే. వేల మంది రోడ్డున పడ్డారు. వేరే ఉద్యోగాలకు పోయారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకే మీడియా డొల్లతనం ఆ పనిచేసిన వారికే తెలుస్తుంది.
Also Read: రెవెన్యూ రచ్చ.. అసెంబ్లీని కుదిపేసింది!
Also Read: రగిలిన ‘విమోచనం’.. కేసీఆర్ ఎందుకు నిర్వహించరు?