Homeఅత్యంత ప్రజాదరణమోడీపై కేసీఆర్ పగ.. భారత్ బంద్ లో టీఆర్ఎస్ హోరు

మోడీపై కేసీఆర్ పగ.. భారత్ బంద్ లో టీఆర్ఎస్ హోరు

TRS Leaders Bandh

తెలంగాణపై దండయాత్ర చేసి కేసీఆర్ ఇగోను దెబ్బతీసిన బీజేపీపై భారత్ బంద్ వేళ తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసి తీర్చుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పోలీస్ వ్యవస్థను ఆధునీకరించి బంద్ లు, రాస్తారోలు, హర్తాల్ పై ఉక్కుపాదం మోపిన కేసీఆర్ తొలిసారి స్వయంగా భారత్ బంద్ పిలుపును ఇచ్చి ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్డెక్కాలని ఆదేశించడం విశేషమనే చెప్పాలి.

Also Read: భారత్ బంద్ ఎందుకు ?

తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది అంటే అది ఖచ్చితంగా బీజేపీ వల్లనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో భారత్ బంద్ కు పిలుపునిస్తే విపక్షాల ఆందోళలను కేసీఆర్ అణిచివేసేవారు. హౌస్ అరెస్టు లు చేయించేవారు. ఇళ్ల నుంచి కాలు బయట పెట్టకుండా కట్టడి చేసేవారు. ఇందుకు భిన్నంగా కేసీఆర్ ఈరోజు భారత్ బంద్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుఫున పిలుపునివ్వడం విశేషం.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిస్తే గులాబీ దండు ఊరుకుంటుందా..? ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా బంద్ పెట్టారు. బస్సులు, రైళ్లను ఆపేశారు. దుకాణాలు మూసివేయించారు. ఇక్కడ బంద్ చేసి కేంద్రానికి సెగతగిలేలా చేయాలని కేసీఆర్ కార్యాచరణ సిద్ధం చేశారు.

Also Read: 505కు చేరిన ఏలూరు బాధితులు.. వింతవ్యాధికి కారణమిదే..

విశేషం ఏంటంటే నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే నిరసనల్లో పాల్గొన్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సైతం రోడ్డెక్కి ఆందోళనల్లో పాల్గొనడం తెలంగాణలో ఎప్పుడూ చూడలేదు. బూర్గులలో రైతులతో కలిసి కేటీఆర్ ధర్నా నిర్వహిస్తున్నారు. మంత్రి హరీష్ తుప్రాన్ లో రాస్తారోకో చేస్తున్నారు.

సాధారణంగా ఇలాంటి నిరసనలకు ప్రభుత్వం, మంత్రులు దూరంగా ఉంటారు. కానీ బీజేపీపై కోపంతో రగిలిపోతున్న గులాబీ దండు ఇప్పుడు కసిగా ఆందోళనలు చేస్తూ కమలదళానికి సెగ పుట్టిస్తోంది. షరా మామూలుగానే ఈసారి పోలీసులు ఈ ధర్నాలు, రాస్తారోకోలను అణిచివేయకుండా దూరంగా ఉండడం విశేషం. ఇలా బీజేపీపై కోపంతో కేసీఆర్, టీఆర్ఎస్ టీం కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల పోరుకు మద్దతుగా తెలంగాణను స్తంభింపచేశారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Oktelugu Epaper