Homeఅత్యంత ప్రజాదరణతెలంగాణలోని ప్రసిద్ధమైన చర్చిలపై ఓ లుక్కేయండి..!

తెలంగాణలోని ప్రసిద్ధమైన చర్చిలపై ఓ లుక్కేయండి..!

medak cathedral church
Medak cathedral church

క్రిస్మస్ పండుగకు మరో వారం రోజుల గడువు మాత్రమే ఉంది. దీంతో దేశవ్యాప్తంగా క్రిస్మస్ సందడి షూరు అయింది. కరోనా కాలంలోనూ కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలను నిర్వహించేందుకు అన్ని చర్చిలు ఇప్పటి నుంచే ముస్తాబు అవుతున్నాయి.

Also Read: క్రిస్మస్ తాత ‘శాంటా క్లాజ్’ కథ తెలుసా?

డిసెంబర్ 24న అర్ధరాత్రి ఏసు క్రీస్తు జన్మించాడు. దీంతో ప్రతీయేటా క్రైస్తవులు డిసెంబర్ 24 రాత్రి 11గంటల నుంచి చర్చిలలో ఏసుక్రీస్తు ప్రార్థనలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. డిసెంబర్ 25న క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవం జరుపుకుంటారు.

ఇక తెలంగాణలోని ప్రసిద్ధమైన ఆలయాలను ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెదక్.. పాల్వంచ.. కొత్తగూడెం.. ఖమ్మం రూరల్.. తల్లాడ ప్రాంతాల్లోని చర్చిల్లో ప్రతీయేటా క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఈ చర్చిల్లో క్రైస్తవులు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రార్థనలు చేస్తుంటారు.

మెదక్‌: మెదక్‌ క్యాథడ్రల్‌ చర్చికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. ఆసియాలో రెండో అతిపెద్ద చర్చిగా దీనికి పేరుంది. ఈ చర్చిలో ప్రతియేటా కుల మతాలకు అతీతంగా అందరు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. ఈ చర్చిలో చాలా ఘనంగా వేడుకలను నిర్వహిస్తారు.

పాల్వంచ: పట్టణంలోని లివింగ్‌ గాస్పెల్‌ చర్చ్‌ ఇండిపెండెంట్‌ చర్చిల్లోనే పెద్దదిగా గుర్తింపు తెచ్చుకుంది. 1984లో సింగరేణి సంస్థలో ఉద్యోగాన్ని వదిలి పాస్టర్‌ లిటిల్‌ దేవసహాయం కొందరు భక్తులతో ఈ చర్చిని బాపూజీ నగర్‌లో ప్రారంభించారు.

Also Read: క్రిస్మస్ ట్రీ వెనుక.. ఓ ఆసక్తికరమైన కథ మీకోసం..!

కొత్తగూడెం: రాష్ట్రంలోనే రెండో పెద్ద చర్చిగా పట్టణంలోని సెయింట్‌ ఆండ్రూస్‌ సీఎస్‌ఐ చర్చి గుర్తింపు తెచ్చుకుంది. 1943లోనే 15కుటుంబాలు కలిసి పోస్టాఫీస్‌ సెంటర్‌లో దీనిని నిర్మించారు. 3వేల మంది ప్రార్థనలు ఒకేసారి చేసేలా దీనిని నిర్మించారు. ప్రతీ ఆదివారం వచ్చే క్రైస్తవులతో చర్చ కళకళలాడుతూ కన్పిస్తుంది.

ఖమ్మం రూరల్‌: కరుణగిరి చర్చి ఖమ్మంలోని నాయుడపేట నుంచి మొదలై అటు బైపాస్‌ రోడ్డు వరకూ ఆనుకొని ఉంటుంది. జిల్లాలోనే చర్చి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. 21ఏళ్లుగా క్రైస్తవులు ఈ చర్చిలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నారు.

తల్లాడ: ఖమ్మం జిల్లాలోని తల్లాడలో లూర్థుమాత ఆలయంలో జిల్లాలోనే అతి పెద్దది. రోమన్‌ కేథలిక్‌ మిషన్‌ ఆధ్వర్యంలో దీనిని 22ఏళ్ల క్రితం నిర్మించారు. చర్చిగోపురంమే 150అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆలయం గంట శబ్ధం చూట్టూ కిలో మీటర్ పైబడి విన్పిస్తుంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular