Homeలైఫ్ స్టైల్Husband And Wife Relationship: దంపతుల మధ్య దూరం ఎందుకు పెరుగుతోంది

Husband And Wife Relationship: దంపతుల మధ్య దూరం ఎందుకు పెరుగుతోంది

Husband And Wife Relationship: ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య అనుబంధాలకు కాలం చెల్లుతోంది. యాంత్రిక జీవితంలో దేనికి విలువ ఉండటం లేదు. దంపతుల మధ్య బంధం బలపడాలంటే వారి మధ్య సమన్వయం ఉండాలి. అన్ని మనసు విప్పి మాట్లాడుకోవాలి. దీనికి సమయమే ఉండటం లేదు. దంపతులకు ఏకాంతంగా మాట్లాడుకునే సమయం ఉండటం లేదు. దీంతో ఇద్దరి మధ్య అన్యోన్యత ఉండటం లేదు. ఫలితంగా విడాకుల వరకు వెళ్తున్నారు. ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరిగితేనే మంచి సంబంధం ఉంటుంది.

అనురాగం కనిపించడం లేదు. ఫలితంగా ఇద్దరి మధ్య ఎడమొహం పెడమొహంగా ఉంటోంది. బాధల్లో కూడా ఇద్దరు సరిగా ఉండటం లేదు. ఎవరి పనులు వారికే తీరడం లేదు. అందుకే అప్యాయతలు కానరావడం లేదు. ఫలితంగా అనారోగ్యాలకు గురైనప్పుడు కూడా సేవలు చేయడానికి సమయం ఉండటం లేదు. దీంతో ఇద్దరికి మధ్య ఎలాంటి వాత్సల్యం ఉండటం లేదు.

ఇద్దరు కలిసి బయటకు వెళ్లే సందర్బాలు కూడా ఉండటం లేదు. కనీసం రెండు మూడు నెలలకోసారైనా విహార యాత్రకు వెళితే ఎంతో ప్రేమ చిగురిస్తుంది. కష్టసుఖాలు తెలుస్తాయి. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవచ్చు. మనం చేసే ఉద్యోగం కన్నా భార్య ముఖ్యం అనుకుంటే ఇలా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా భార్యతో సమయం గడిపితే ఎంతో ప్రేమ పుడుతుంది.

ప్రస్తుత కాలంలో వస్తున్న విపరీత ధోరణుల వల్లే దంపతుల్లో ప్రేమ ఉండటం లేదు. సమయం చిక్కడం లేదు. ఉన్న సమయంలో సద్వినియోగం చేసుకోవడం లేదు. ఫలితంగా ఆలుమగల మధ్య అడ్డుగోడలు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో దంపతులు సమయం కల్పించుకుని జీవిత భాగస్వామిని సంతోషపెట్టాల్సిన సమయం కేటాయించుకోవాలి. అలా వారి కాపురంలో కలతలు లేకుండా చూసుకోవాల్సిన సమయం ఉంటుంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular