Homeలైఫ్ స్టైల్TTD: తిరుమల నడక భక్తులపై కీలక నిర్ణయం

TTD: తిరుమల నడక భక్తులపై కీలక నిర్ణయం

TTD: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడు. వడ్డీకాసులవాడు. శ్రీవారికి ప్రతిరూపమైన వెంకటేశ్వరుడిని కొలిచేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. వారి సేవల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల సౌకర్యార్థం పలు నిర్ణయాలు తీసుకుంటుంది. పాలకవర్గం ప్రతి ఏటా సమావేశమై కొన్ని కీలక నిర్ణయాలు ఆమోదిస్తుంది. ఇందులో భాగంగా తిరుమలకు కాలినడకన వచ్చే వారికి టోకెన్లు ఇవ్వాలని కూడా నిర్ణయించింది. దీంతో కాలినడకన వచ్చే భక్తుల కష్టాలు తొలగుతాయి. ఈ నెల 5 […]

TTD: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడు. వడ్డీకాసులవాడు. శ్రీవారికి ప్రతిరూపమైన వెంకటేశ్వరుడిని కొలిచేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. వారి సేవల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల సౌకర్యార్థం పలు నిర్ణయాలు తీసుకుంటుంది. పాలకవర్గం ప్రతి ఏటా సమావేశమై కొన్ని కీలక నిర్ణయాలు ఆమోదిస్తుంది. ఇందులో భాగంగా తిరుమలకు కాలినడకన వచ్చే వారికి టోకెన్లు ఇవ్వాలని కూడా నిర్ణయించింది. దీంతో కాలినడకన వచ్చే భక్తుల కష్టాలు తొలగుతాయి.

TTD
TTD

ఈ నెల 5 నుంచి కాలినడకన వచ్చే భక్తులకు అనుమతి ఇచ్చేందుకు నిర్ణయించారు. బాలాజీ నగర్ వద్ద ఉన్న స్థలంలో ఎలక్ట్రిక్ బస్ స్టేషన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దీంతో ప్రయాణికుల కష్టాలు కూడా తీరనున్నాయని తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల వసతి గృహాల ఆధునీకరణకు రూ. 19 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉద్యోగుల గృహాలు మరమ్మతులు చేయించి మంచి హంగులతో రూపుదిద్దుకోనున్నాయి.

Also Read: సూర్య గ్రహణం తరువాత ఈ రాశులు వారికి పట్టిందల్లా బంగారమే?

మహారాష్ట్రలోని నవీ ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం పది ఎకరాల స్థలం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీనికి గాను అక్కడి మంత్రి అందుకు సంబంధించిన భూమి పత్రాలను వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. ఆలయ నిర్మాణానికి రేమండ్ సంస్థ ముందుకొచ్చింది. దీంతో పనులు ప్రారంభించనున్నారు. ఇంకా పాలకమండలి కొన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగా ఆమోదించింది.

భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి కాలం దృష్ట్యా భక్తుల సంఖ్య పెరిగే సూచనలు ఉన్నాయి. అందుకే వచ్చే వారికి ఎక్కడ కూడా ఇబ్బందులురాకుండా చూసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. గతంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం పనికిరాదని చెప్పారు. ఉద్యోగులు తమ విధులు సక్రమంగా నిర్వహించి సేవలు చేయాలని తెలిపారు.

Also Read: రేపే శని అమావాస్య.. ఈ తప్పులు చేయొద్దు.. అసలేం చేయాలంటే?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Oktelugu Epaper