Garuda Purana : గరుడ పురాణాన్ని హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ గరుడ పురాణం ఎన్నో విషయాలను తెలుపుతుంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కష్టాలు రావడం కామన్. వాటిని చూసి మనిషి బాధపడుతాడు కూడా. అయితే చేసే కర్మలే మనకు సమస్యలు తెస్తాయి అంటారు నిపుణులు. ఇక ఈ గరుడ పురాణం ప్రకారం.. రోజు ఓ ఐదు పనులు చేస్తే మాత్రం ఎలాంటి బాధలు ఉండవు అంటున్నారు నిపుణులు. ఉన్న బాధలు తొలిగిపోయి సుఖ సంతోషాలు కలిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు జ్యోతిష్యులు. మరి, ఆ ఐదు పనులు ఏంటి అనుకుంటున్నారా?
ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఈ ఐదు పనులను కచ్చితంగా చేయాలట. ఈ పనుల వల్ల జీవితంలో ఆనందం, సంతోషం, శాంతి వస్తాయి. అంతేకాదు మరణం తర్వాత మోక్షం కూడా వస్తుందట.
కుల దేవత: ప్రతి ఒక్కరికి కూడా వారి కుల దైవం ఉంటుంది. ఇప్పటి వారికి కుల దేవత గురించి తెలియకపోవచ్చు. కానీ ప్రతి ఒక్క వంశానికీ కులదేవత ఉంటుంది. కచ్చితంగా ఈ కులదేవతను పూజించాలి. గరుడ పురాణం ప్రకారం, కుల దేవత సంతోషిస్తే, మీ ఏడు తరాలు సంతోషంగా ఉండేలా దీవిస్తుందట. అందుకే వారిని కచ్చితంగా పూజించాలి.
రుచికరమైన నైవేద్యం..భగవంతునికి ఆహారాన్ని రుచి చూడకుండా నైవేద్యంగా పెట్టాలి. ఇలా పెట్టే ఇంట్లో ఎప్పుడూ ఆహారానికి, సంపదకు లోటు ఉండదు అంటున్నారు నిపుణులు. కాబట్టి, మీకు అన్నపూర్ణ ,మా లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. వంటగదిలో ఎప్పుడూ పాత ఆహారాన్ని ఉంచకూడదు. అంతేకాదు ఇంటిని మురికిగా ఉంచకూడదు.
అన్నదానం: హిందూ ధర్మంలో దానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల మీకు పుణ్యం లభిస్తుంది. అందుకే మీ సామర్థ్యాన్ని బట్టి దానం చేయడం అలవాటు చేసుకోండి. దీని వల్ల మీ తరానికే కాకుండా ఏడు తరాల వారికి మంచి జరుగుతుంది అంటున్నారు జ్యోతిష్యులు.
జ్ఞానం: ప్రతి వ్యక్తి మత గ్రంథాలలో దాగి ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఉన్నత ప్రాక్టికల్ విద్యతో పాటు మతపరమైన విధులపై అవగాహన కలిగి ఉండటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది.
ఆలోచన: తపస్సు, ధ్యానం మొదలైనవి చేయడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దీని వల్ల కోపం కంట్రోల్ లో ఉంటుంది. దీని కారణంగా ఇంట్లో శాంతి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు మీ కృషితో ప్రయత్నాలు చేయండి ఫలితాలు అవే వస్తాయి.