Chanakya Niti: ఆచార్య చాణక్యుడు ఎన్నో విషయాల గురించి బోధించారు. అందులో ముఖ్యంగా వైవాహిక జీవితం గురించి కూడా ఎన్నో విషయాలను తెలిపారు. అయితే పెళ్లి అయిన తర్వాత పురుషుడు పరాయి స్త్రీ పట్ల ఆకర్షితుడు అవుతుంటాడు. ఇంతకీ కొందరు ఇలా ఎందుకు చేస్తారో? దానికి గల కారణాలు ఏంటి అని ఆలోచించారా? అయితే వాటి గురించి చాణక్యుడు తెలిపాడు. ఒకసారి మీరు కూడా చూసేయండి.
ఈ రోజుల్లో పురుషులు, మహిళలు ఒకరినొకరు ఆకర్షించుకోవడం కామన్ గా జరుగుతుంటుంది. అయితే ఈ ఆకర్షణ మెప్పును దాటి తప్పుడు సంబంధాలుగా మారినప్పుడే ఆ బంధం చెడ్డదిగా మారుతుంది. ఇలాంటిది జరిగితే వైవాహిక జీవితం కూడా నాశనం అయ్యే అవకాశం ఉంది. అయితే వివాహేతర సంబంధం ఎప్పుడు కూడా తప్పుగానే పరిగణిస్తారు. మరో స్త్రీ పట్ల తన భర్త భార్యకు దూరం ఎందుకు అవుతారంటే.. చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం భార్యాభర్తల బంధానికి హానీకరం.
ఒక వ్యక్తి చిన్న వయసులోనే తన కెరీర్ పై సీరియస్ గా ఉంటాడు. ఈ వయసులో అవగాహన కూడా తక్కువే. ఇతర వాటిపై దృష్టి కూడా ఉండదు. కానీ కాలక్రమేణా జీవితం స్థిరంగా ఉంటూ కెరీర్ సులభం అయినప్పుడు ఆ వ్యక్త తన కోరికలపై శ్రద్ధ చూపుతాడు. అటువంటి పరిస్థితిలో వివాహేతర సంబంధాల ప్రమాదం జరుగుతుంది. భార్యాభర్తల సంబంధంలో శారీరక సంతృప్తి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అది లేకపోవడం వల్ల ఇద్దరి మధ్య ఆకర్షణ తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వివాహేతర సంబంధాల వైపు అడుగులు పడుతుంటాయి.
వైవాహిక జీవితంలో భాగస్వామి మనసు కలత చెందడం చాలా తరచుగా అవుతుంటుంది. అటువంటి పరిస్థితిలో ఇతర స్త్రీల వైపు మొగ్గు చూపుతారు పురుషులు. ఇక్కడ భార్యాభర్తలిద్దరు కూడా ఒకరిపై ఒకరికి ప్రేమ, అనురాగం ఉండాలి. అయితే తల్లిదండ్రులు అయ్యేవరకు ప్రేమ బాగున్నా.. పిల్లలు పుట్టాక బిజీ వల్ల కాస్త దూరం అనేది పెరుగుతుంది. అలాంటప్పుడు కూడా ఇతర స్త్రీలపై పురుషుడు ఆసక్తి చూపే ప్రమాదం ఉందన్నారు ఆచార్య చాణక్యుడు.