
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో మూడో రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసిన ఇదయతుల్లాతో పాటు పులివెందులకు చెందిన వైకాపా కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్ లను సీబీఐ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. నిన్న ఇదయతుల్లాను 7 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు.. ఇవాళ మరోసారి అతడిని విచారణకు పిలిచారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఈ విచారణ జరుగుతోంది. నిన్న ఇదయతుల్లాతో పాటు వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరిని కూడా అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.