
వ్యాక్సినేషన్ పై కేంద్రం ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. పౌరుల సౌలభ్యం కోసం మొబైల్ ఫోన్లలో ఉండే వాట్సప్ ద్వారానే టీకా స్టాట్ లు బుక్ చేసుకునే వీలు కల్పించింది. దీనికి సంబంధించి ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ ఓ ట్వీట్ చేశారు. ఈ విధానం వల్ల టీకా రిజిస్ట్రేషన్ మరింత సులువుగా మారనున్నది. వాట్సాప్ ద్వారా టీకా బుక్ చేసుకునే పద్ధతి.. పౌరుల సేవలో కొత్త యుగానికి తెరలేపిందని మంత్రి తెలిపారు. మీ ఫోన్లలోనే చాలా సులువైన రీతిలో కోవిడ్ టీకా బుకింగ్ చేసుకోవచ్చు అన్నారు. కేవలం నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు.