తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. సెప్టెంబర్ నెలకు గానూ రూ. 300 టికెట్లను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. గత నెల వరకు 5 వేల టికెట్లను విడుదల చేసిన తితిదే.. సెప్టెంబర్ నెలకు సంబంధించి 8 వేల టికెట్లను భక్తుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది.