
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించారు. రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం కొత్త ఉపకులపతులను నియమించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు యూజీసీ నిబంధనలకు అనుగుణంగా వీసీల నియమక యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లల నియామక ప్రక్రియను చేపట్టి పేర్లను సిఫారసు చేశాయి. కరోనా కారణంగా కొంత ఆలస్యం జరిగిందని, కసరత్తు పూర్తి అనంతరం ఆమోదం కోసం గవర్నర్ కు పంపినట్లు ప్రభుత్వం తెలిపింది. ఉస్మానియా యూనివర్సటీ వీసీగా ప్రొఫెసర్ డి. రవీందర్ యాదవ్, కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ టీ రమేష్, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ రవీందర్ గుప్తా, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ సీతారామరావు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ కిషన్ రావు, పాలమూరు యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, జేఎన్టీయూ వీసీగా కట్టా నర్సింహారెడ్డి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్ రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ మల్లేశం, జవహర్ లాల్ ఆర్కిటెక్కర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వీసీగా ప్రొఫెసర్ కవిత దర్యాని నియామకం అయ్యారు.