వర్షం కారణంగా ఇండియా, శ్రీలంక మ్యాచ్ కు అంతరాయం ఏర్పాడింది. భారత్ 23 ఓవర్లకు 147/3 తో ఆడుతోంది. క్రీజులో సూర్యకుమార్, మనీశ్ ఉన్నారు. అయితే జయవిక్రమ వేసిన 22.1 ఓవర్ కు సూర్యకుమార్ బతికిపోయాడు. అతడు తొలి బంతిని ఎదుర్కోగా లంక బౌలర్ ఎల్బీగా అప్పీల్ చేశాడు. అంఫైర్ ఔటిచ్చాడు. కానీ రివ్యూకు వెళ్లిన సూర్యకుమార్ అక్కడ నాటౌట్ గా తేలాడు. బంతి వికెట్లకు నేరుగా పిచ్ అవ్వకపోవడంతో థర్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు.