పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుండటంపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్పందించారు. భారీ విజయం దిశగా దూసుకుపోతున్న మమతాబెనర్జికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దీదీ ఓ దీతీ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రచార సభల్లో చేసిన వెక్కిరింతలకు ఈ పలితాలు గట్టి సమాధానమని పేర్కొన్నారు.