కరోనా సంక్షోభం కారణంగా మే 31న జరగాల్సిన సివిల్స్ ప్రాథమిక పరీక్ష వాయిదా పడి అక్టోబర్ 3, 4తేదీలలో జరగనుంది. ప్రిలిమ్స్ రాసే అభ్యర్థుల కోసం ప్రత్యక రైళ్లను నడపనున్నట్లు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లను ఇచ్చాపురం -విశాఖ; కోరాపుట్-విశాఖ; కోరాపుట్-కటక్ మార్గాలలో ఈ సర్వీసులు అందుబాటులో వుంటాయని తెలిపింది.