
అఫ్ఘానిస్థాన్ లో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న ఏపీ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్లను ప్రకటించింది. ఏపీ కార్మికులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు కార్మికశాఖ ఆధ్వర్యంలో టోప్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ రేకారాణి స్పష్టం చేశారు. అఫ్ఘనిస్థాన్ లో ఉన్న కార్మికులు, వారికి సంబంధించిన వివరాలను 0866-2436314 కు లేదా 91-7780339884 నంబర్లకు ఫోన్ చేసి చెప్పాలని కార్మిక శాఖ వెల్లడించింది.