సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ కొత్త నియమం తీసుకొచ్చాడు. మసీదుల్లో ప్రార్థనలు చేయడానికి, ఉపన్యాసాలు ప్రసారం చేసేందుకు లౌడ్ స్పీకర్లను వినియోగించకూడదంటూ ఆంక్షలు విధించారు. ప్రస్తుతం ఉన్న లౌడ్ స్పీకర్ల ధ్వనిని మూడో వంతు వరకు తగ్గించాలని సౌదీ పాలకుడు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలు జారీ చేశారు. దేశ ఇస్లామిక్ వ్యవహారా మంత్రిత్వ శాక ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మసీదుల పరిసరాల్లోని చాలా మంది తల్లిదండ్రులు, నివాసితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ఆ చర్యలకు ఉపక్రమించారు.