కేటీఆర్ పై రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎక్సైజ్ శాఖ విచారణ నివేదిక ఎందుకు ఈడీకి ఇవ్వడం లేదు? ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్ కమిటీ ఏమైంది అంటూ రేవంత్ మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ ను స్వీకరించిన ఆయన సోమవారం ఉదయం గన్ పార్క్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ అకున్ సబర్వాల్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. డ్రగ్స్ కేసు విచారణలో ఉండగానే అకున్ సబర్వాల్ ని తప్పించారు. బంజారాహిల్స్ మాదాపూర్, కొండాపూర్ వరకూ పబ్బులు వ్యాప్తి చెందాయి.
విదేశాల నుంచి వచ్చిన డ్రగ్స్, గంజాయి వాడకం ఎక్కువైంది. కేటీఆర్ కి బాధ్యత లేదా? అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు నేరగాల్లనే చర్చ తర్వాత చేద్దాం. అమర వీరుల స్తూపం ముందు మేము రెడీగా ఉన్నాం. మా తండ్రి, తాత, ముత్తాత చరిత్ర కూడా చర్చిద్దాం. డగ్ర్ కేసు చర్చ పక్కదారి పట్టించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారు. మీ ఆస్తులు అడగడం లేదు. రానా, రకుల్ ప్రీత్ సింగ్ ని ఈడీ పిలిచింది. వాళ్లని నేను అంటుంటే కేటీఆర్ ఎందుకు ఉలిక్కి పడుతున్నారు. కేసులు వేస్తం అని బెదిరిస్తున్నారు.
కేటీఆర్ నీ స్థాయి పెద్దది అనుకుంటున్నావు. నువ్వు ఎమ్మెల్యే కాకముందే నేను ఎమ్మెల్సీ అయ్యాను. నువ్వు మొదటిసారి ఎమ్మెల్యేగా కేవలం 100 ఓట్లతోనే గెలిచావు అని అన్నారు. రాజకీయాల పరంగా చూస్తే కేటీఆర్ నువ్వ నా వెంట్రుకతో సమానం. నువ్వు విసిరినా సవాల్ నే నేను స్వీకరించా. గన్ పార్క్ కి అర గంట ముందే కేటీఆర్ వస్తారు అనుకున్నా. అని రేవంత్ అన్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Revanth reddy shocking comments on ktr
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com