
ఏపీలో మత్స్య కారులకు అండగా ఉంటామన్న మాట నిలబెట్టుకున్నామని సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ఆన్ లైన్ విధానంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా సంక్షోభంలోనూ మత్స్యకార భరోసా కొనసాగుస్తున్నామన్నారు. అధికారంలోకి రాగానే 2019లో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్లు గుర్తు చేశారు. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 10 లక్షల పరహారం ఇస్తున్నామన్నారు. 1,19,875 కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఆదుకుంటున్నామన్నారు.