
తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,20,525 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,771 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 13 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,469కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 2,384 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి.