
ఆఫ్ఘనిస్థాన్ లో ఒక్కో ప్రాంతాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆఫ్ఘన్ సైన్యం, తాలిబన్ల మధ్య యుద్ధం సాధారణ ప్రజలను బలి తీసుకుంటోంది. తమ దేశం రావణకాష్టంగా మారుతుండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్న రషీద్ ఖాన్ ట్విట్టర్ ద్వారా తన గోడు వెల్లబోసుకున్నాడు. ప్రపంచ నేతలారా మా దేశం గందరగోళంగా ఉంది. పిల్లలు, మహిళలు సహావేల మంది ప్రతి రోజు మరణిస్తున్నారు. మమ్మల్ని ఇలా గందరగోళంలో వదిలేయకండి. ఆఫ్ఘన్ల హత్యలను, ఆఫ్ఘనిస్థాన్ విధ్వంసాన్ని ఆపండి అని ఎంతో ఆవేదనతో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్ లోని 65 శాతం భూభాగం మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది.