Homeఎంటర్టైన్మెంట్Pradeep Ranganathan : ఆరుగురు డైరెక్టర్స్ తో ఒకే సినిమా.. నిర్మాతగా ప్రదీప్ రంగనాథన్ సరికొత్త...

Pradeep Ranganathan : ఆరుగురు డైరెక్టర్స్ తో ఒకే సినిమా.. నిర్మాతగా ప్రదీప్ రంగనాథన్ సరికొత్త ప్రయోగం..

Pradeep Ranganathan : డైరెక్టర్ గా హీరో గా ప్రదీప్ రంగనాథన్ ఎలాంటి సెన్సేషన్ సృష్టించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. డైరెక్టర్ గా ఆయన మొదటి చిత్రం ‘కోమలి’ సూపర్ హిట్ అయ్యింది . ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తూ హీరో గా చేసిన ‘లవ్ టుడే’ చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ రెండు సినిమాల తర్వాత ఇతర డైరెక్టర్స్ దర్శకత్వంలో ఆయన హీరో గా నటించిన ‘డ్రాగన్’, […]

Pradeep Ranganathan : డైరెక్టర్ గా హీరో గా ప్రదీప్ రంగనాథన్ ఎలాంటి సెన్సేషన్ సృష్టించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. డైరెక్టర్ గా ఆయన మొదటి చిత్రం ‘కోమలి’ సూపర్ హిట్ అయ్యింది . ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తూ హీరో గా చేసిన ‘లవ్ టుడే’ చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ రెండు సినిమాల తర్వాత ఇతర డైరెక్టర్స్ దర్శకత్వంలో ఆయన హీరో గా నటించిన ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ చిత్రాలు కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘LIK’ చిత్రం యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఇకపోతే నేడు ఆయన తదుపరి చిత్రాన్ని నేడు ఒక బ్లాస్టింగ్ వీడియో తో అధికారికంగా ప్రకటించారు. కానీ ఈసారి డైరెక్టర్ గా , హీరో గా కాదు , నిర్మాతగా.

ఆయన నిర్మాతగా ఒక లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు ని చేయబోతున్నట్టు కొంతకాలం క్రితం ఒక వార్త ప్రచారం లోకి వచ్చింది. ఇందులో ‘ప్రేమలు’, ‘డ్యూడ్’ ఫేమ్ మమిత బైజు ప్రధాన పాత్ర పోషించబోతున్నారని ప్రచారం జరిగింది. ఈ వార్తలను నిజం చేస్తూ , నేడు ప్రదీప్ రంగనాథన్ అధికారికంగా ప్రకటించారు. ‘PR షో’ అనే బ్యానర్ పై ఈ క్రేజీ మూవీ ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి కథ కూడా ఆయనే అందించారు. ఈ చిత్రానికి ఒకరు కాదు, ఆల్ఫా యూనిట్ ద్వారా ఏకంగా 6 మంది దర్శకులు దర్శకత్వం వహించనున్నారు. సాయి అభయంకర్ సంగీత దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో అనామిక మహి , స్వశిక , డైరెక్టర్ అస్వత్ మారిముత్తు , శివాజీ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఒక సినిమాకు ఏకంగా 6 మంది దర్శకత్వం వహించడం చరిత్రలో ఇదే తొలిసారి.

ప్రదీప్ ఈ విధంగా ఒక సరికొత్త ప్రయోగం చేయబోతున్నారనే చెప్పాలి. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాతో ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా సక్సెస్ అవుతారో లేదో చూడాలి. ఇకపోతే ఆయన హీరో గా నటించే సినిమాల వివరాలు ప్రస్తుతానికి బయటకు రాలేదు. ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం , నిర్మాతగా వ్యవహరించబోయే ఈ సినిమా మీదనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న అస్వత్ మారిముత్తు గతం లో ప్రదీప్ ని హీరో గా పెట్టి ‘డ్రాగన్’ అనే సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రజినీకాంత్ హీరో గా నటిస్తున్న ‘ధర్మన్ ‘ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతటి బిజీ షెడ్యూల్ లో కూడా ఆయన ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించబోతుండడం గమనార్హం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper