
ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై ఏ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ వివాదంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ వియజసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. హెరిటేజ్ భవనం మినమా మిగతా బ్లాక్ లలో నిర్మించలేరా? అని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలిస్తోందని నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని ఏజే ప్రసాద్ న్యాయస్థానాన్ని కోరారు. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎన్నేళ్లు కావాలంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.