విశాఖలో మానసిక వికలాంగుల పాఠశాల కూల్చివేత సరికాదని మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్ కి లేఖ రాశారు. 140 మంది మానసిక వికలాంగులైన చిన్నారులు అక్కడ ఆశ్రయం పొందుతున్నారని చెబూతూ జీవీఎంసీ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరిగి ఆ పాఠశాల ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.