West Bengal politics : పశ్చిమ బెంగాల్.. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట. ఈ కంచుకోట ను బద్దలు కొట్టడానికి మమతా బెనర్జీ అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. బెంగాల్ ప్రజలకు తనును తాను దీదీ గా పరిచయం చేసుకున్నారు. టాటా నానో ఫ్యాక్టరీ ఏర్పాటు సందర్భంగా ఆందోళన చేసి.. బెంగాల్ ప్రజలకు ఆశా దీపం లాగా కనిపించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మమత విజయ దుందుభి మోగించారు. అనంతరం వరుస ఎన్నికల్లో విజయాలు సాధించి బెంగాల్ అంటే మమత.. మమతా అంటే బెంగాల్ గా మార్చుకున్నారు. దశాబ్దాలుగా బెంగాల్ రాష్ట్రాన్ని పరిపాలించిన కమ్యూనిస్టులకు చరమగీతం పాడారు. కనీసం క్షేత్రస్థాయిలో కార్యకర్తలు లేని పరిస్థితిని తీసుకొచ్చారు.
మమత ప్రారంభంలో ఉన్నట్టుగా ఉంటే బెంగాల్లో ఈ పరిస్థితి ఉండేది కాదు. కమ్యూనిస్టులు అరాచకం చేశారంటే.. అంతకుమించిన దారుణాలు మమత చేశారు. శారద కుంభకోణం నుంచి మొదలు పెడితే.. మెడికల్ విద్యార్థి హత్య వరకు ప్రతి విషయంలోనూ మమత తన మూర్ఖత్వాన్ని ప్రదర్శించారు. అల్లుడికి పెత్తనం మొత్తం ఇచ్చి బెంగాల్ రాష్ట్రాన్ని తన సొంత ఆస్తి లాగా మార్చేసుకున్నారు. చివరికి ప్రభుత్వ వేతనంతో ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిపక్షాలకు నరకం చూపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే మమత చేసిన దారుణాలు ఒక పట్టాన కొరుకుడు పడవు. చివరికి కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా బెంగాల్ రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా అడ్డుకున్నారు. కేంద్ర మంత్రులపై దాడులు కూడా చేయించారు.
పాపి చిరాయువు అన్నట్టుగా.. మమతా బెనర్జీ చేసిన పాపాలు మొత్తం ఒక్కొక్కటిగా బయటపడడం మొదలుపెట్టాయి. దీనికి తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బెంగాల్ మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. అక్రమంగా వలస వచ్చి.. భారత పౌరసత్వం పొందిన బంగ్లాదేశ్ ఓటర్ల మీద చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. దీంతో బెంగాల్ రాష్ట్రంలో మమత బాగోతం బయటపడడం మొదలైంది. బంగ్లాదేశీయుల సహకారంతో పశ్చిమబెంగాల్ లో అధికారంలోకి వచ్చిన మమత.. నరేంద్ర మోడీ, అమిత్ షా మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. బంగ్లాదేశ్ ప్రాంతానికి చెందిన వారిని ఈ దేశ పౌరులని చెప్పడం ప్రారంభించారు. వారికి కల్పించిన ఓటు హక్కును తొలగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇవన్నీ కూడా బెంగాల్ ప్రజల్లో ఆలోచన ను రేకెత్తించాయి. బంగ్లాదేశ్ నుంచి భారీగా వస్తున్న వలసల వల్ల బెంగాల్ మొత్తం నాశనం అవుతుందని అక్కడి ప్రజలకు అర్థమైంది. దీంతో ప్రజలు మార్పును కోరుకున్నారు. దీనికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వ పెద్దల అడుగులు పడటంతో బెంగాల్ రాష్ట్రంలో మార్పు తద్యమని అనిపించింది.
గత ఎన్నికల్లో కాళ్లకు కట్టుకట్టుకొని.. మహానటి లాగా ప్రదర్శన చేసిన మమత.. ఈసారి ఆ పని చేయలేకపోయింది. ఎందుకంటే ఆ పని కంటే ముందుగానే బిజెపి పెద్దలు బెంగాల్ రాష్ట్రంలో స్వచ్ఛభారత్ మొదలుపెట్టారు. ఫలితంగా ఇన్నాళ్లపాటు మమతకు ఆయుధంగా ఉన్న వర్గాలు దూరమయ్యాయి. అసలు వారి ఓటు హక్కును కేంద్రం పక్కనపెట్టింది. వారందరినీ కూడా బంగ్లాదేశ్ కు తన్ని తరిమేసింది. దీంతో మమతకు వాస్తవం అర్థమైంది. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మోడీ షా వ్యూహం ముందు ఈసారి మమత తలవంచింది.. అప్రతిహతంగా పరిపాలించిన బెంగాల్ రాష్ట్రాన్ని దూరం చేసుకుంది. అందుకే యద్భావం తద్భవతి అని పెద్దలు అంటారు.