కోవిడ్ నియంత్రణలో భాగంగా ఈ నెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడగించినందున మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసు అధికారులను డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. లాక్ డౌన్ అమలుపై జోనల్ ఐజిలు, డిఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతిభద్రతల విభాగం అడిషన్ డీజీపీ జితేందర్, ఇంటలిజెంట్స్ విభాగం ఐజీ ప్రభాకర్ రావు లు పాల్గొన్నారు. రాష్ట్రంలో లాక్ డౌడ్ అమలు తీరును ప్రతిరోజు జిల్లాల వారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారు అని తెలిపారు.