
కాంగ్రెస్, టీఆర్ ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గజ్వేల్ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ టార్గెట్ గా వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో రేవంత్ వైట్ ఛాలెంజ్ పేరిట మంత్రి కేటీఆర్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. తాను పరీక్షలకు సిద్ధమని రాహుల్ గాంధీ రెడీనా అని ప్రశ్నించారు.
ఈ క్రమంలో కేటీఆర్ సోమవారం ట్వీటర్ వేదికగా రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు. ఢిల్లీ ఎయిమ్స్ లో ఏ రకమైన పరీక్షకైనా నేను సిద్ధమే రాహుల్ వస్తాడా చరల్లపల్లి బ్యాచ్ తో నేను టెస్టులు చేసుకుంటే నా గౌరవం తగ్గుతుంది. నాకు క్లీచ్ చిట్ వస్తే పదవికి రాజీనామా చేసి రేవంత్ క్షమాపణ చెస్తాడా ఓటుకు కోట్ల కేసులో లై డిటెక్టర్ పరీక్షకు రేవంత్ సిద్ధమా అని కేటీఆర్ ప్రశ్నించాడు.
ఈ నేపథ్యంలో తాజాగా కేటీఆర్ చట్టపరమైన చర్యలకు సిద్ధం అయ్యారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ కోర్టును ఆశ్రయించినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా నాపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పరువునష్టం దావా వేశాను. న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరాను. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఒకరు ట్వీట్ చేస్తే దానికి ప్రతిగా మరొకరు కౌంటర్ ఇస్తున్నారు. ఆ ఇద్దరి ట్వీట్ల వార్ తో తెలంగాణ రాజకీయలు రసవత్తరంగా మారుతున్నాయి.