జగన్, కేసీఆర్ రాజకీయ అవసరాల కోసం రెండు రాష్ట్రాల మధ్య నీటి గొడవలు పెంచి పెద్దవి చేయొద్దని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. నవసూచనల పేరిట ఏపీ సీఎం జగన్ కు ఆయన మరో లేఖ రాశారు. నదీ జలాల అంశంలో సీఎం చేసిన వ్యాఖ్యలపై ఇరు రాష్ట్రాల ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్నారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు నెరపడం వల్ల ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపిన జగన్ జల వివాదాలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని రఘురామ ప్రశ్నించారు. తెలంగాణలోని ఆంధ్రా వారి గురించి సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Jagan did not know that raghurama
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com