జమునా హేచరీస్ వివాదంపై శుక్రవారం మరోసారి హైకోర్టులో విచారణ జరపనుంది. తమకు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా తమ భూములను సర్వే చేయడంపై జమునా హేచరీస్ హైకోర్టును ఆశ్రయించింది. గత విచారణలో అచ్చం పేట భూములపై ఇచ్చిన నివేదిక చెల్లదని న్యాయస్థానం చెప్పింది. జమునా హేచరీస్ భూములపై సర్వే చేయాలంటే ముందస్తు నోటీసులు తప్పనిసరి అని, జూన్ లో పిటిషనర్లకు ముందుస్తు నోటీసులు ఇచ్చి సర్వే చేసుకోవచ్చనని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఇవాళ మరో సారి న్యాయస్థానం విచారించనుంది.