తొలి గంటలో భారత్ మెరుగ్గానే ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 21, శుభమన్ గిల్ 23 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. అనవసరంగా తొందరపడటం లేదు. అందివచ్చిన బంతుల్నే బౌండరీకి తరలిస్తున్నారు. 15 ఓవర్లకు భారత్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. మరోగంట సేపు ఇలాగే ఆడితే ఓపెనర్లు కుదురుకున్నట్లే.