
తెలంగాణలోని కోర్టుల్లో అన్ లాక్ ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర హైకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు సిబ్బంది అంతా విధులకు హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రోజు విడిచి రోజు సిబ్బంది విధులకు హాజరవుతున్నారు. ఈ నెల 19 నుంచి కోర్టుల్లో పాక్షికంగా ప్రత్యక్ష కేసుల విచారణ జరుగనుంది. ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో 31 వరకు ఆన్ లైన్ కేసుల విచారణ కొనసాగనుండగా హైకోర్టులో ఈనెల 31వరకు ఆన్ లైన్ ద్వారా కేసుల విచారణ జరుగనుంది.