గుంటూరులో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన రమ్య కేసు సత్వర విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి సుచరిత తెలిపారు. రమ్య కుటుంబాన్ని పరామర్శించిన ఆమె.. ప్రభుత్వం కేటాయించిన 5 సెంట్ల ఇంటి స్థలం పత్రాలను అందజేశారు. బాధితురాలి సోదరికి త్వరలో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, ఐదెకరాల సాగు భూమి కూడా అందజేస్తామని పేర్కొన్నారు.