ప్రజా దీవెన యాత్రలో భాగంగా మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగ 12వ రోజు ఈటల హుజూరాబాద్ నియోజకవర్గంలోని పోతిరెడ్డిపల్లి, కొండపాక గ్రామాల్లో పర్యటించారు. పాదయాత్ర కొనసాగుతుండగానే వీణవంక మండలం కొండపాక వద్ద ఈటల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరం రావడంతో ప్రత్యేక బస్సులో ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం ఈటల ఆరోగ్యం నిలకడగా ఉందని.. మెరుగైన వైద్యం కోసం ఈటలను హైదరాబాద్ తరలించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.