కోవిడ్ -19 చికిత్సలో ఉపయోగపడే ఆక్సిజన్, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లను వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకోవద్దని పోలీసులను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే స్వాధీనం చేసుకున్నవాటిని విడుదల చేయాలని తెలిపింది. ప్రస్తుత నెలకొన్న అత్యవసర పరిస్థితుల్లో వీటిని ప్రజలు అత్యధిక ధరలకు కొనుక్కుని ఉండవచ్చునని వ్యాఖ్యానించింది. ఆక్సిజన సిలిండర్లు, రెమ్ డెసివిర్ ఔషధాలను స్వాథీనం చేసుకున్న దర్యాప్తు అధికారులు వెంటనే డిప్యూటీ కమిషనర్లకు సమాచారం తెలియజేయాలని హైకోర్టు తెలిపింది.