తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తోటి భక్తులు ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి కోరారు. కొవిడ్ నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం అధికారులతో సమీక్షించారు. మే నెలలో రోజుకు 15 వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేశామని చాలా తక్కువ మంది మాత్రమే బుక్ చేసుకున్నారని చెప్పారు.