
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య చుక్కల మందుపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఆనందయ్య చుక్కల మందుకు సంబంధించిన నివేదిక అందిందన ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. చుక్కల మందు వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని తెలిపింది. ఈ ఔషధం ప్యాకింగ్, నిల్వకు నెల నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ఇందువల్ల మూడు నెలల తర్వాత పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.