
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,20,397 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,061 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,18,837కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 11 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,618కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,556 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 5,99,695 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,524 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.