
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,08,617 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 858 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,25,237కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో తొమ్మిది మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,678 చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1175 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 12,726 యాక్టివ్ కేసులు ఉన్నాయి.