
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో శనివారం చోటుచేసుకున్న బాంటు పేలుళ్లలో మృతుల సంఖ్య 50 దాటింది. మరో 100 మంది గాయాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని ఆఫ్ఘనిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. శనివారం సాయంత్రం కాబూల్ లోని ఓ బాలికల పాఠశాల సమీపంలో ఉగ్రవాదులు పేలళ్లకు పాల్పడ్డారు. అయితే ఈ పేలుళ్లకు బాధ్యలెవరన్నది ఇంకా తెలియరాలేదు.