
ఇంగ్లాండ్లో కరోనా వైరస్ తీవ్రత తగ్గినట్లే తగ్గి మల్లి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇంగ్లాండ్ దేశంలోసెకండ్ వేవ్ మొదలైనట్లు ప్రభుత్వం అనుకుంటుంది. గత వారం 99 మంది మరణించగా, ఈవారంలో 139 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నియంత్రణ చర్యలను ప్రభుత్వం కఠినతరం చేసినప్పటికీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధని పాటించని 18 ఏళ్లు పైబడిన వారికి 200 పౌండ్ల (రూ.18,950) జరిమానా విధిస్తారు. రెండోసారి ఇదే పునరావృతం అయితే 400 పౌండ్లు చెల్లించాల్సిందే. ఉల్లంఘన మళ్లీ జరిగే రెండింతల జరిమానా విధిస్తారు. దేశంలో ప్రతి 10 వేల మందిలో 100 మంది కరోనా బారినపడ్డారు.