సీఎం జగన్ పోలవరం చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో సీఎం ఏరియల్ సర్వే చేస్తారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ ను పరిశీలిస్తారు. ఇంజినీర్లను అడిగి గోదావరి వరద పరిస్థితిని జగన్ తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎస్సీ నారాయణ రెడ్డి, సీఈ సుధాకరబాయి తదితరులతో ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్షిస్తారు.