
పశ్చిమబెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనలపై సమగ్ర విచారణ కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నలుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. అదనపు కార్యదర్శ స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ బెంగాల్ లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించనున్నది. ఈ ప్రత్యేక బృందం గురువారం బెంగాల్ లో పర్యటించనున్నదని కేంద్ర హోంశాఖ తెలిపింది.