అఫ్గానిస్థాన్ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. విదేశాంగ మంత్రి జైశంకర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ సహా ఇతర ప్రధాన పార్టీల నేతలు హాజరయ్యారు. వైకాపా నుంచి మిథున్ రెడ్డి, తెదేపా తరఫున గల్లా జయదేవ్, తెరాస నుంచి నామా నాగేశ్వరరావు సమావేశంలో పాల్గొన్నారు. అఫ్గాన్ నుంచి భారతీయులు తరలింపునకు కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న చర్యలు సహా ఇతర అంశాలను విదేశాంగ మంత్రి జైశంకర్ నేతలకు వివరించనున్నారు.