సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకానికి సంబంధించి సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో అఖిలపక్ష భేటీ ప్రారంభం అయింది. ఈ అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు, సీపీఐ, సీపీఐఎం నుంచి సీనియర్ దళిత నేతలు ఇతర దళిత నాయకులకు ఆహ్వానాలు అందాయి. సీఎం దళిత సాధికారత పథకం విధి విధానాలపై సమావేశంలో చర్చిస్తున్నారు.