Ayodhya Ram Mandir donations : అయోధ్య రామాలయం.. 500 ఏళ్ల పోరాట గీతం.. 2019 సుప్రీంకోర్టు తీర్పుతో రామాలయానికి దారులు పడ్డాయి. 2024 జనవరిలో ప్రారంభమైంది. ఆరోజు నుంచి కోట్లాది మంది భక్తులు అయోధ్య రామాలయాన్ని దర్శించారు. భక్తులు భక్తితో దేవుడితో కానుకలు కూడా వేశారు. ఇప్పుడు ఆ కానుకలే.. విశ్వాసంతో వేసిన కానుకలు కొట్టేశారు. ఒకనాడు 10 హుండీ బాక్సులు ఉండేవి. జనం రద్దీ వల్ల 40 హుండీ బాక్సులను ఏర్పాటు చేశారు. సిస్టంలు పెట్టారు. సీసీటీవీలు ఉన్నాయి. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు ఇప్పుడు శ్రీమంతులు అయ్యారు. కోటీశ్వరులుగా మారారు. ఇదంతా పైన వారికి తెలియకుండా జరిగిందా? లేక పైన వారు కింది వారు కుమ్మక్కు అయ్యారా? తేలాల్సింది ఇదీ..
డబ్బులు పోవటం అయిత వాస్తవం. కోట్ల రూపాయల డబ్బు.. కేజీల కొద్దీ బంగారం మాయమైందని అయోధ్యలో దారుణం జరిగిందని వార్తలు వస్తున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోతే బంగారం, డబ్బు చూస్తే టెంప్ట్ అవ్వడం ఖాయం. అయోధ్య రామాలయ నిర్వహణ ఒక ట్రస్ట్ ద్వారా జరుగుతోంది. 2019లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక ట్రస్ట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2020 ఫిబ్రవరిలో ట్రస్ట్ ఏర్పడింది. మొత్తం 15 మంది ట్రస్ట్ సభ్యులు. అందులో ముగ్గురు ప్రభుత్వ అధికారులు. మిగతా 12 మంది మఠాధిపతులు హిందూ ప్రముఖులు ఇందులో ఉన్నారు. సుప్రీంకోర్టు సూచించిన దాంట్లో ఒకరు దళితులు అయ్యి ఉన్నారు. ఈ ట్రస్ట్ ప్రభుత్వ ట్రస్ట్ కాదు. ఇండిపెండెంట్ ట్రస్ట్.
అయోధ్య రామాలయంలో భక్తుల కానుకల్ని బొక్కేశారు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
