ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా అశోక్ గజపతి రాజు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పారదర్శకతతో ముందుకెళ్తున్నామన్నారు. అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మాన్సాస్ ట్రస్ట్ సిబ్బందికి జీతాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కార్యాలయాన్ని విజయనగరం నుంచి ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించారు. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు.