Al Qaeda
కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ హతమైనా అతడు స్థాపించిన ‘అల్ ఖైదా’ ఉగ్రవాద సంస్థ మాత్రం ఇంకా ప్రతీకారంతో రగులుతూనే ఉంది. తాజాగా దేశంలోనూ మారణహోమం సృష్టించడానికి రెడీ అయ్యింది. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 9మంది అల్ ఖైదా ఉగ్రవాదులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శనివారం అరెస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపింది. అల్ ఖైదాతో సంబంధాలున్న ఉగ్రవాదులను ఎన్ఐఏ గుర్తించి అరెస్ట్ చేసింది.
Also Read: ఐపీఎల్ వేళాయే.. రేపటి నుంచి క్రికెట్ పండుగ
అరెస్ట్ అయిన అల్ ఖైదా ఉగ్రవాదులు పాకిస్తాన్ దేశానికి చెందిన అల్ ఖైదా ఉగ్రవాదుల సోషల్ మీడియా ద్వారా స్ఫూర్తి పొందారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.